Wednesday, May 15, 2024

రాష్ట్రంలో కొత్తగా 285 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

285 covid cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 285 కొవిడ్ కేసులు నమోదుయ్యాయి. గడిచిన 24 గంటల్లో 28,424 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…285 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,95,293కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 65 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,89,561 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.28 శాతంగా నమోదైంది. మరో 651 మంది ఫలితాలు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,621 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 188 కొవిడ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 54 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరిలో 16 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News