Wednesday, May 8, 2024

భారత్ లో కరోనా విలయతాండవం… 3.6 లక్షల కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

3.62 Lakh Corona positive cases in India

 

ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వైరస్ చాపకింద నీరులా దేశ వ్యాప్తంగా వ్యాపించింది. భారత్ లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గత 24 గంటల్లో 17.23 లక్షల మంది కరోనా టెస్టులు చేస్తే.. 3.6 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా 3293 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1.79 కోట్లకు చేరుకోగా 2.01 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 1.48 కోట్ల మంది కోలుకోగా 29.72 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో 28.27 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. 14.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News