Saturday, April 27, 2024

ఉద్యోగం రాదని మనస్థాపం… విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Student commit suicide in Nalgonda

 

నల్లగొండ: ఉద్యోగం రాదని మనస్థాపానికి గురై ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పాక శ్రీకాంత్ అనే యువకుడు బాటనీలో పిజి చేశాడు. గతంలో అనారోగ్యంతో శ్రీకాంత్ తండ్రి రామచంద్ర మృతి చెందాడు. తల్లి గంగమ్మ మానసిక రోగి కావడంతో పట్టుదలతో పిజి పూర్తి చేశాడు. గత సంవత్సరం ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కరోనా సమయంలో ఉద్యోగాలు లేకపోవడంతో పొలం వద్ద పురుగుల మందు తాగాడు. రైతులు గమనించి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News