Wednesday, May 8, 2024

ఘోర అగ్నిప్రమాదం: నలుగురు కోవిడ్ రోగులు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

Four covid patient dead in Fire accident in Hospital

ముంబయి: మహారాష్ట్రలోని థానేలో ప్రైమ్ క్రిటీకేర్ ఆస్పత్రిలో బుధవారం వేకువజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు కోవిడ్ రోగులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. గత వారం ముంబయిలోని విరార్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. ఐసియులో షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News