- Advertisement -
అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జార్ఖండ్ నుంచి విశాఖపట్నానికి వెళ్తున్న ఓ కారు పలాస మండలంలోని మొగిలిపాడు ఫ్లైఓవర్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈఘటనలో మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అనతంరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
3 dead in Road Accident in Srikakulam
- Advertisement -