Friday, May 3, 2024

పుల్వామాలో ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -
3 Lashkar Terrorists Killed In Encounter In Pulwama
ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని పుల్వామా జిల్లాల బుధవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఒక పాకిస్తాన్ జాతీయుడితోసహా ముగ్గురు లష్కరే-తాయిబా ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారం మేరకు భద్రతా దళాలు దక్షిణ కశ్మీరులోని పుల్వామా పట్టణంలో బుధవారం సోదాలు నిర్వహించిన సమయంలో కాల్పుల పోరు సంభవించింది. ఉగ్రవాదులు ముందుగా కాల్పులు జరపడంతో ప్రతిగా భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపాయని, ఈ కాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని ఒక పోలీసు అధికారి తెలిపారు. మరణించిన ఉగ్రవాదులలో పాకిస్తాన్ జాతీయుడైన లష్కరే కమాండర్ ఐజాజ్ అలియాస్ అబు హురేరా ఉన్నట్లు అ అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News