Tuesday, May 7, 2024

పడవ బోల్తా: ముగ్గురు గల్లంతు…

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: నాటు పడవ బోల్తా పడి ముగ్గురు గల్లంతైన సంఘటన ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా చిత్ర కొండ సమితి స్వాభిమాన్ ఏరియా జలాశయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒండ్రాపల్లి గ్రామానికి చెందిన 11 మంది వ్యక్తులు పనుల నిమిత్తం నక్కమమ్ముడి గ్రామానికి వెళ్తుండగా నాటు పడువ జలాశయంలో మధ్యలో మునిగిపోయింది. గోపాల్ ముదులి (45), కుమార్తె జమున, మూడేళ్ల మనవడు గల్లంతు కాగా మరో ఎనిమిది మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులు ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News