- Advertisement -
న్యూఢిల్లీ: శ్రీలంక సిరీస్ లో భారత జట్టుకు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఎన్నికయ్యారు. 2014 తర్వాత ద్రవిడ్ టీమిండియా ప్రధాన జట్టుతో పనిచేయడం ఇదే మొదటిసారి. జూలైలో శ్రీలంకతో భారత్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. వన్డే, టీ20 జట్టుకు ద్రవిడ్ కోచ్ గా విధులు నిర్వహించనున్నారు. లంక సిరీస్ సమయంలోనే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ ఆడనుంది. దీంతో ప్రధాన కోచ్ రవిశాస్త్రితో సహా కోచింగ్ బృందం ఆ జట్టుతో ఉండనుంది. ఈ క్రమంలోనే కోచ్ అవసరం ఏర్పడింది. డబ్ల్యూటిసి ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్ తో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడనున్నట్టు తెలుస్తోంది.
Rahul Dravid to coach Indian team on Sri Lanka tour
- Advertisement -