Saturday, May 4, 2024

స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు..

- Advertisement -
- Advertisement -

చిత్తూరు: జిల్లాలోని రేణిగుంట మండలం జీ పాల్యం సమీపంలోని స్వర్ణముఖి నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈతకు వెళ్లిన విద్యార్థులు నదిలో గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు ఒకరిని రక్షించారు. మిగతా ముగ్గురి కోసం గాలించిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రెస్క్యూ సిబ్బందితో అక్కడికి చేరుకుని గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

3 students missing in Swarnamukhi River in Renigunta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News