న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రాకాసి రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,525 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 122 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74,281కు పెరిగింది. ప్రస్తుతం 47,480 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇండియాలో ఇప్పటివరకు 24,386 నయమై కోలుకున్నారు. దేశంలో 2,415 మంది కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అటు మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 25వేలకు చేరువలో ఉన్నాయి. మహారాష్ట్రలో తాజాగా 1,026 కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా కేసులు రెట్టింపవుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కోవిడ్ -19 కేసుల్లో ప్రపంచంలో ఇండియా 12వ స్థానానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 75వేలకు చేరువలో ఉంది.
3525 covid 19 cases and 122 deaths in india