Tuesday, April 30, 2024

ఎపిలో కొత్తగా 380 పాజిటీవ్ కేసులు..ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

380 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కరోనా పాజిటీవల్ కేసులు పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటలలో 30,978మందికి పరీక్షలు చేయగా, కొత్తగా 380 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా మరో ఇద్దరు బాధితులు మరణించినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 8 లక్షల 93వేలకు పైగా కరోనా పాజిటీవ్ కేసుల నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారిసంఖ్య 7,189కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,083మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 204 మంది కోలుకోగా.. ఇప్పవటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8లక్షల 84 వేలకు పైగా కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోటీ 47 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

380 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News