Monday, May 6, 2024

పాక్‌లో 3864కు పెరిగిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona Cases in Pakistan

 

మృతులు 54 మంది, కోలుకున్నది 429 మంది

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో తాజాగా 500కు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3864కు చేరింది. 54 మంది వరకు మృతి చెందారు. జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేస్తూ గత 24 గంటల్లో నలుగురు కరోనా వైరస్‌తో మృతి చెందారని వెల్లడించింది. 429 మంది కోలుకున్నారని, 28 మంది క్లిష్టపరిస్థితిలో ఉన్నారని , గత 24 గంటల్లో 3088 మందితోసహా మొత్తం 39183 మందిని పరీక్షించడమైందని వివరించింది. ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు పాక్షిక లాక్‌డౌన్ పొడిగించింది. లాక్‌డౌన్ ఫలితంగా దెబ్బతిన్న వారిని, వ్యాపారాలను ఆర్థికంగా ఆదుకోడానికి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ రూ.1200 బిలియన్ ప్యాకేజీని ప్రకటించారు. రక్షణ సామగ్రి లోపించినందుకు బెలూచిస్థాన్ లో ఆందోళనకు దిగిన డాక్టర్లను, వైద్యసిబ్బందిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న 12 మంది డాక్టర్లకు వైరస్ సోకడంతో ఈ ఆందోళన తలెత్తింది.

 

3864 Corona Cases in Pakistan
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News