న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,970 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85,940కు చేరింది. అందులో 53,035 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30,153మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ మహమ్మారితో 2,752 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అటు మహారాష్ట్రలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా కేసులు 29,100 చేరాయి. అందులో ప్రస్తుతం 21,468 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,068 కరోనా వైరస్ కభలించగా.. 6564 మంది కోవిడ్ తో కోలుకున్నారు. ఈ కరోనా భూతం మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోంది.
3970 New Covid 19 cases And 103 deaths in India