Sunday, April 28, 2024

టిఎస్ ఆర్టీసి ఉద్యోగులకు 4.8 శాతం డిఎ మంజూరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఉద్యోగులకు (4.8 శాతం) డిఏను మంజూరు చేసినట్టు టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ వెల్లడించారు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మొత్తం 9 డిఏలను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది జూలై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డిఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డిఏను సిబ్బందికి చెల్లించనున్నట్టు ఆయన ప్రకటించారు. టిఎస్ ఆర్టీసి ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని, సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News