Tuesday, May 21, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

తూర్పుగోదావరి: జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దాపురంలో ఏడిబి రహదారిపై ఎదురుగా వచ్చిన లారీని కారు ఢీకొట్టింది. తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి తొమ్మిది మంది కారులో రాజమహేంద్రవరం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదు నెలల చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం పెద్దాపురం ప్రభుత్వ తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

4 Dead in Road Accident in East Godavari

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News