Saturday, May 4, 2024

దేశంలో కరోనా టెర్రర్.. ఒక్కరోజే 16,922 కేసులు

- Advertisement -
- Advertisement -

418 deaths and 16922 new COVID 19 cases in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 418 మరణాలు, అత్యధికంగా ఒకే రోజు 16,922 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 4,73,105కి చేరింది. వీటిలో ప్రస్తుతం 1,86,514 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియాలో ఇప్పటివరకు 2,71,697 నయమై కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 14,894 మంది బాధితులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

తెలుగురాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఎపిలో 10,331 కరోనా కేసులు,129 మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో 10,444 కేసులు, 225 మంది కరోనాతో మరణించారు. మహారాష్ట్రలో లక్షా 42,900 కోవిడ్ పాజిటివ్ కేసులు… 6,739 మంది మృతి చెందారు. తమిళనాడులో 67,468 పాజిటివ్ కేసులు… 866 మరణాలు నమోదయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలో 70,390 కరోనా పాజిటివ్ కేసులు..2365 మంది కరోనాతో మృతి చెందారు. గుజరాత్ లో కోవిడ్ కేసులు 30వేలకు చేరువలో ఉన్నాయి. దేశంలో ఒక్కరోజులోనే 17వేలకు చేరువలో కరోనా కొత్త కేసులు నమోదు కావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

418 deaths and 16922 new COVID 19 cases in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News