- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 17,609 మందికి పరీక్షలు నిర్వహించగా కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయని ఎపి వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,961కి చేరుకున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఎపికి చెందిన వారు 376మంది ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన 19మందికి కోవిడ్ సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 70 మందికి ఈ వైరస్ సోకింది. ఇప్పటివరకు ఆంధ్రలో కరోనాతో 96 మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.
- Advertisement -