Sunday, April 28, 2024

పి-305 నౌక ప్రమాదం… 49కు చేరిన మృతులు

- Advertisement -
- Advertisement -

ముంబయి: తౌటే తుఫాన్ ధాటికి సముద్రంలో పి-305 అనే నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 49 మంది చనిపోగా 26 మంది ఆచూకీ తెలియలేదని నౌకదళం పేర్కొంది. బార్జ్ నౌకలో మొత్తం 261 మంది ఉన్నారు.  186 మందిని కాపాడామని నౌక దళ విపత్త సహాయ బృందం తెలిపింది. గల్లంతైన వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవని పేర్కొంది. పి-305 బార్జ్ కెప్టెన్ బల్విందర్ సింగ్ తౌక్టే తుపాన్‌ను తేలికగా తీసుకున్నాడని చీఫ్ ఇంజనీర్ రహమాన్ షేక్ తెలిపారు. గాలుల వేగం పెద్దగా లేదని, తుపాన్ ప్రభావం గంట సేపు మాత్రమే ఉంటుందని అలసత్వం వహించారన్నారు. బల్విందర్ అలసత్వంతోనే ఇంత మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం రహమాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News