Sunday, April 28, 2024

న్యూయార్క్ లో కాల్పులు.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. న్యూయార్క్ రాష్ట్రంలో బ్రోంక్స్ లోని సబ్‌వే స్టేషన్‌లో ఆరుగురు వ్యక్తులపై దుండగు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈఘటనలో ఒక వ్యక్తి మరణించిగా.. మరో ఐదుగురు గాయపడినట్లు నగర పోలీసులు తెలిపారు.

సోమవారం జరిగిన కాల్పుల్లో ఎవరినీ అరెస్టు చేయలేదని, గాయపడిన ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ లోని ఓ అధికారిని చెప్పారు.ఈ ఘటనకు పాల్పాడిన దుండగుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News