Saturday, May 18, 2024

బస్సు-కారు ఢీ: ఐదుగురు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

5 Members dead in Bus collided car

రాంఛీ: జార్ఖండ్ రాష్ట్రం రామ్‌గర్ జిల్లాలో బుధవారం ఉదయం బస్సు-కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారుకు మంటలు అంటుకోవడంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. వెంటనే బస్సులో ఉన్న 20 మంది ప్రయాణీకులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. బస్సు ధన్‌బాద్ నుంచి రాంచీకి వెళ్తుండగా, కారు రామ్‌గర్ నుంచి బోకారో వెళ్తుండగా బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఐదుగురు చనిపోయారు. కారు ముందుభాగం నుజ్జు నుజ్జుగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డోర్లు ఓపెన్ కాకపోవడంతో అందులో ఉన్న వారు బయటకు రాలేకపోయారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. బస్సులో వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు కూడా మంటల్లో కాలిపోయింది. వాహనదారుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News