Saturday, May 4, 2024

ఇంటిగోడ కూలి ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో సోమవారం ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. గత రెండు రోజులుగా ఈ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పఖంజోర్ ప్రాంతం లోని ఇర్పనార్ గ్రామంలో ఇంట్లో మట్టిగోడ కూలిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో దంపతులతోపాటు వారి ముగ్గురు పిల్లలుకూడా ప్రాణాలు కోల్పోయారు.

5 of a Family killed as house wall collapsed in Raipur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News