Friday, April 26, 2024

యువతికి మత్తు మందు ఇచ్చి… 30 రోజుల నుంచి 60 మంది అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

60 Members rape on Young women

 

రాంఛీ: ఓ యువతిని మత్తు మందు ఇచ్చి.. గదిలో బంధించి గత 30 రోజుల నుంచి ఆమెపై 60 మంది అత్యాచారం చేసిన సంఘటన ఝార్ఖండ్‌లోని సరాయ్‌కేలా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 22 ఏళ్ల యువతిని కొందరు యువకులు కిడ్నాప్ చేసి కందర్‌బేరా శివారులో ఉన్న గ్యారేజీలో బంధించారు. ఆమెకు మత్తు మంది ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశారు. ఇలా 30 రోజుల నుంచి ఆమెపై చిత్తకార్తె కుక్కల్లా అత్యాచారం చేశారు. నరక కూపం నుంచి తప్పించుకోవాడానికి ప్రయత్నించింది కానీ వీలు కాలేదు. టాయిలెట్‌కు వెళ్లి వస్తానని చెప్పి అక్కడి నుంచి బయటపడి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె అనారోగ్యం పాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News