- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మరో 60 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాపై తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఆరోగ్య శాఖ.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1777కు చేరుకుందని తెలిపింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 36కు చేరుకుంది.ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో మొత్తం 1012 మందికి చికిత్స అందుతుండగా.. కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తం 729మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
60 New Corona Cases Registered in AP
- Advertisement -