- Advertisement -
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కరోనాతో 7 మంది మృతి చెందారు. దీంతో ఎపిలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,003 కి చేరింది. ఎపిలో 8.69 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం ఎపిలో కొత్తగా 663 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,69,412 కి చేరింది. ఇందులో 8,55,485 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 6,924 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 34, చిత్తూరులో 106, తూర్పుగోదావరి జిల్లాలో 60, గుంటూరులో 86, కడపలో 29, కృష్ణాలో 117, కర్నూలులో 5, నెల్లూరులో 34, ప్రకాశంలో 15, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 54, విజయనగరంలో 17, పశ్చిమ గోదావరిలో 96 కేసులు నమోదయ్యాయి.
- Advertisement -