Tuesday, May 14, 2024

హైతీలో భూకంపం… 304 మంది మృతి

- Advertisement -
- Advertisement -

7.2 magnitude earthquake hits Haiti

హైతీ : కరేబియన్ దేశంలోని హైతీలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత  రిక్టర్‌ స్కేల్‌పై 7.2గా నమోదైందని యుఎస్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో 304 మృతి చెందారని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. హైతీలోని సెయింట్ లూయిస్ డు సుడ్ కు 12 కిలో మీటర్ల దూరంలో, 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని యుఎస్ జియోలాజికల్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News