Monday, May 13, 2024

తెలంగాణలో కొత్తగా 71 కరోనా కేసులు.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

71 New Corona Cases Reported in Telangana

 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా మరో 71 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఈ రోజు నమోదై కేసుల్లో 38 జిహెచ్ఎంసి పరిధిలో నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చల్ లో 6 వికారాబాద్ లో 1, నల్గొండలో 1, సూర్యాపేట్ లో 1 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది.అలాగే, 12 మంది వలస కూలీలకు, విదేశాల నుంచి వచ్చిన నలుగురికి కూడా కరోనా సోకినట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1991కి చేరింది. కరోనా వైరస్ నుంచి ఈ రోజు మరో 120 మంది డిశ్చార్జ్ అయ్యారని, ఒకరు మృతి చెందారని వివరించింది. దీంతో కరోనా ఇప్పటివరకు 57 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రిల్లో 651 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 1,284 మంది కోలుకున్నారు.

71 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News