- Advertisement -
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో గత 24 గంటల్లో 75 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 722కు చేరగా.. ఇప్పటివరకు 20 మంది కరోనా బారిన పడి మృతి చెెందారు. ప్రస్తుతం 610 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడగా, కరోనా నుంచి కోలుకొని 92 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక, దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 17,545 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 567 మంది మరణించారు.
రాష్ట్రంలో జిల్లాలవారిగా కరోనా కేసుల వివరాలు:
జిల్లాలు |
కరోనా రోగుల సంఖ్య |
కర్నూల్ | 174 |
గుంటూరు | 148 |
కృష్ణ | 80 |
నెల్లూరు | 68 |
ప్రకాశం | 44 |
కడప | 40 |
వెస్ట్ గోదావరి | 35 |
చిత్తూరు | 53 |
అనంతపురం | 33 |
విశాకపట్నం | 21 |
ఈస్ట్ గోదావరి | 26 |
75 New Corona Cases Registered in AP
- Advertisement -