అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 90వేలకు చేరువైంది. ఎపిలో గడచిన 24 గంటల్లో కొత్తగా 7,813 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇవాళ ఒక్కరోజే కరోనాతో 52 మంది చనిపోయారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88,671కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 985కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 44,431 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడిన 43,255మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 53,681మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఎపిలో మొత్తం 15 లక్షల 95వేలకు పైగా కరోనా పరీక్షలు చేశామని పేర్కొంది.
7813 New Corona Cases Reported in AP