Tuesday, May 7, 2024

గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

8813 new covid cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ముందు రోజు 14 వేలుగా ఉన్న కేసులు తాజాగా 9 వేల దిగువకు తగ్గాయి. సోమవారం 2.12 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 8813 మందికి వైరస్ బయటపడింది. పాజిటివిటీ రేటు 4.15 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 15,040 మంది కోలుకున్నారు. 29 మంది మరణించారు. ఇప్పటివరకు 4.42 కోట్ల మందికి కరోనా సోకగా, 98.46 శాతం మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల కేసులు 1.11 లక్షల (0.25 శాతం)కు పడిపోయాయి. ఇప్పటివరకు 208 కోట్ల టీకా డోసులు పంపిణీ కాగా, అందులో సోమవారం 6.10 లక్షల మంది టీకా తీసుకున్నారని మంగళవారం కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News