Wednesday, May 15, 2024

జల్లేరువాగులో బోల్తాపడిన బస్సు: 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

9 Members dead in Bus accident in west godawari

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి జల్లేరువాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. 47 మంది ప్రయాణికులతో బస్సు అశ్వారావు పేట నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్రేన్ సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. నీళ్లలో నుంచి బస్సును బయటకు తీసిన తరువాత మృతుల సంఖ్య తెలిసే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News