Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 9062 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

9062 Corona positive cases in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 9062 మందికి కరోనా వైరస్ సోకగా 36 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.42 కోట్లకు చేరుకోగా 5.27 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అందులో 4.36 కోట్ల మంది కోలుకోగా 1.05 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికి ఢిల్లీలో మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. ఢిల్లీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 917 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్వాప్తంగా ఇప్పటి వరకు 208 కోట్ల మందికి డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News