Monday, April 29, 2024

టెకీలకు కష్టకాలం..భారీ స్థాయిలో ఉద్వాసనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఐటి ఉద్యోగులకు కొత్త సంవత్సరం దుర్వార్తలతో ప్రారంభమైందనే చెప్పాలి. ఈ నెల ప్రారంభమైన 15 రోజుల్లోనే 91 కంపెనీలకు చెందిన 24 వేల మందికిపైగా ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోవడం రానున్న కాలం ఎంత దుర్భరంగా ఉండగలదో సూచిస్తోంది. అమేజాన్, సేల్స్‌ఫోర్స్, కాయిన్‌బేస్ తదితర కంపెనీలకు చెందిన దాదాపు 24,151 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు లేఆఫ్స్ అనే వెబ్‌సైట్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులలో తమ ఉద్యోగుల సంఖ్యలో 20 శాతం మందిని తగ్గించనున్నట్లు క్రిప్టో లెండింగ్ ఎక్స్‌చేంజ్ క్రిప్టో.కాం గత వారం ప్రకటించింది.

భారతీయ కంపెనీలైన ఓలా ఇప్పటి వరకు 200 మంది ఉద్యోగులను తొలగించగా గత ఏడాది డిసెంబర్‌లో ఒకేసారి 17,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికి స్కిట్.ఎఐ అనే స్టార్టప్ పతాక శీర్షకకు ఎక్కింది. 2022లో మేటా, ట్విటర్, ఒరాకిల్, ఎన్‌విడియా, స్నాప్, ఊబర్, స్పాటిఫై, ఇంటెల్, సేల్స్‌ఫోర్స్‌కు చెందిన 1,53,110 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయినట్లు వెబ్‌సైట్ తెలిపింది. ఒక్క గత ఏడాది నవంబర్ నెలలోనే 51,489 మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది.

కాగా, 2023లో తన ఉద్యోగుల సంఖ్యను కుదించడానికి ఐటి దిగ్గజం గూగుల్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తన ఉద్యోగులలో 6 శాతం మందిపై గూగుల్ వేటు వేసే అవకాశం ఉంది. దీని ప్రకారం 11 వేల మది గూగుల్ ఉద్యోగులు ఈ ఏడాది లేఆఫ్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈనెలాఖరులో విడుదలయ్యే టెక్ దిగ్గజాల త్రైమాసిక ఫలితాలపైనే అందరి కళ్లూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దీని తర్వాత టెక్ ఉద్యోగుల భవిష్యత్తు ఎలా ఉండనుందో తేలిపోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News