Sunday, May 5, 2024

భారత్ లో మరో 95,735 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

95735 new COVID 19 cases and 1172 deaths in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 11,29,756  శాంపిళ్లను పరీక్షించగా 95,735 కొత్త కోవిడ్-19 కేసులు, 1,172 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,65,864కి చేరింది. ఇండియాలో ప్రస్తుతం 9,19,018 యాక్టివ్ కేసులుండగా, 34,71,784 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 75,062 మంది కరోనాతో మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. కాగా, భారత్ లో బుధవారం వరకు మొత్తం 5,29,34,433 కరోనా టెస్టులు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ తెలిపింది.

95735 new COVID 19 cases and 1172 deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News