- Advertisement -
పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
హైదరాబాద్ : టిఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో సిఎం కెసిఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో సమావేశమవుతారు. ఈ నెల 14 నుండి పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జిఎస్టీ విషయంలో కేంద్రం వైఖరి, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై వివరలు అందిస్తారు.
CM KCR to meet with TRS MPs on Today
- Advertisement -