అమరావతి: భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జంకల అప్పారావు(37), మంగ(33) అనే దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు. దంపతుల మధ్య గొడవలు మొదటి నుంచి జరుగుతుండేవి. భర్త ప్రతి రోజు మద్యం తాగి వచ్చి భార్యను హింసించేవాడు. తన దగ్గర బంధువైన జంకల మణికంఠతో మంగ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో రోజు గొడవలు జరిగేవి. భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి మంగ ప్లాన్ వేసింది. భర్త నిద్రస్తున్న సమయంలో మంగ, మణికంఠ అతడిని కత్తితో నరికి చంపారు. ప్రమాదవశాత్తు భర్త మరణించాడని స్థానికులకు తెలిపడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. బలమైన గాయాలు ఉండడంతో భార్యపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో ప్రియుడితో కలిసి హత్య చేశానని ఒప్పుకుంది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.