- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో వర్షాకాల సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రశ్నోత్తరాలు.. జీరో అవర్ తర్వాత పలు బిల్లులను ప్రవేశపెట్టి సభ ఆమోదించే అవకాశాలున్నాయి. అసెంబ్లీలో కరోనా వైరస్ పై చర్చ జరుగనుంది. గురువారం ఉదయం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఉండనుంది. శుక్రవారం రెవెన్యూ బిల్లుపై చర్చించనున్నారు. రోజంతా సభ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
- Advertisement -