మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలలో 22న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు, మహబూబ్నగర్, వనపర్తి మున్సిపాలిటీలలో, కరీంనగర్ కార్పొరేషన్లోని 3, 24, 25వ వార్డుల ఎన్నికలపై స్టే
హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులన్నీ తొలగిపోయి అంతిమంగా తెరలేచింది. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు ఈ నెల 22న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు ఘట్టాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టిపిసిసి అధ్యక్షుడు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి చౌహాన్ ఆధ్వర్యంలోని ధర్మాసనం దానిని కొట్టివేసింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా షెడ్యూలు ప్రకటన పట్ల పిటిషనర్ వ్యక్తం చేసిన అభ్యంతరం వీగిపోయింది. అయితే వార్డుల రిజర్వేషన్పై పిటిషనర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం మహబూబ్నగర్, వనపర్తి మున్సిపాలిటీల వార్డులతో పాటు కరీంనగర్ కార్పొరేషన్లోని 3, 24, 25వ వార్డుల ఎన్నికలపై స్టే విధించింది.