Tuesday, April 30, 2024

ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

High Court

హైదరాబాద్: నగరంలోని ఖిల్‌వత్ ప్రాంతంలో శనివారం ఎంఐఎం నిర్వహిస్తున్న సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఎంఐఎం సభకు విధించిన షరతులను పాటించని పక్షంలో చర్యలు ఉంటాయని ధర్మాసనం ఇచ్చిన అనుమతిలో పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎలాంటి ర్యాలీలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. శనివారం నాడు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11వరకు సభ మాత్రమే జరుపుకోవాలని కోర్టు నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం సభా కార్యక్రమాలకు సంబంధించి మొత్తం వీడియో తీయాలని డిజిపి మహేందర్‌రెడ్డికి హైకోర్టు అదేశాలిచ్చింది. సభా ప్రాంగణంతో పాటు నగరంలో ఎక్కడా అల్లర్లు చోటుచేసుకోకుండా చూడాలని, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

High Court green signals to MIMI’s Sabha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News