Sunday, May 19, 2024

పుదుచ్చేరి బీచ్ లో గల్లంతైన నిఖిల్ రెడ్డి మృతదేహం లభ్యం..

- Advertisement -
- Advertisement -

 

పుదుచ్చేరి సముద్రంలో గల్లంతైన హైదరాబాద్ కు చెందిన యువకుడు నిఖిల్ రెడ్డి(22) మృతదేహాన్ని విల్లుపురం పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్..ఫార్మాలిటీస్ త్వరగా పూర్తి చేయాలని విల్లుపురం ఎస్పిని కోరారు.దీంతో ఈ రోజు సాయంత్రం వరకు నిఖిల్ రెడ్డి మృతదేహం హైదరాబాద్ చేరుకోనుంది. గత శనివారం కుషాయిగూడ సాయినగర్ కు చెందిన నిఖిల్ రెడ్డి తన ఫ్రెండ్స్ తో కలిసి  పుదుచ్చేరికి విహారయాత్రకు వెళ్ళాడు. టూర్ లో భాగంగా సోమవారం అక్కడి బీచ్ కు వెళ్లారు. అందరు బీచ్ లో ఆడుతుండగా అలల తాకిడికి నిఖిల్ కొట్టుకుపోయాడు. స్నేహితులు నిఖిల్ ను కాపాడదామని ప్రయత్నించినా రాకాసి అలల తాకిడికి కనిపించకుండా కొట్టుకుపోయాడు. దీంతో నిఖిల్ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో పుదుచ్చేరిలోని కొటకుప్పం పోలీసులకు అతని స్నేహితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు విహారయాత్రకు వెళ్లిన కొడుకు తిరిగిరాన్ని లోకాలకు వెళ్లిపోయాడని తెలువడంతో నిఖిల్ కుటుంబం శోఖ సంద్రంలో మునిగిపోయింది.

Hyd youth Nikhil Reddy Dead in puducherry’s beach

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News