Saturday, May 4, 2024

పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి తల్లిపై ఆర్మీ జవాను కాల్పులు..

- Advertisement -
- Advertisement -

 

గుంటూరు: పెళ్లికి నిరాకరించిన తన ప్రియురాలి తల్లిపై ఆర్మీ జవాను కాల్పులు జరిపాడు. ఈ ఘటన జిల్లాలోని చెరుకుపల్లి మండలం, నడింపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాను బాలాజీ, నడంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే, బాలాజీని పెళ్లి చేసుకునేందుకు ఆ యువతి తల్లి రమాదేవి ఒప్పుకోలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన బాలాజీ తుపాకీ తీసుకొని తన ప్రియురాలి ఇంటికి వెళ్లి.. ఆమె తల్లిపై కాల్పులు జరిపాడు. వెంటనే రమాదేవి పక్కకు తప్పుకోవడంతో చెవికి స్పల్ప గాయంతో బతికిపోయింది. తుపాకీ పేల్చిన శబ్దం విని చుట్టు ప్రక్కలవారు రావడంతో తన వెంట తెచ్చుకున్న తుపాకీ, బ్యాగు అక్కడే వదిలేసి అతను పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. గాయపడిన బాదితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆర్మీ జవాను బాలాజీకి సహకరించిన ఆటో డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

 

Army Jawan fires on Girlfriend’s Mother in Guntur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News