- Advertisement -
న్యూఢిల్లీ: సిఎఎ వ్యతిరేక ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తంగా మారాయి. సోమవారం సిఎఎకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన రాళ్లదాడిలో మృతుల సంఖ్య ఏడుకు చేేరుకోగా… మరో 105 మంది చికిత్స పొందుతున్నారు. ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈస్ట్ ఢిల్లీతో పాటు పలు నగరాల్లో పోలీసులు హై అలర్డ్ ప్రకటించారు. నిన్న జరిగిన దాడిలో పోలీస్ తో పాటు ఆరుగురు ఆందోళనకారులు మృతి చెందారు. సోమవారం జరిగిన రాళ్లదాడి నేపథ్యంలో మంగళవారం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజ్ ఘాట్ వెళ్లే మార్గంలో భద్రతపై ఢిల్లీ పోలీసులతో పాటు ఇంటలిజెన్స్ అధికారులు, అమెరికా సీక్రెస్ సర్వీస్ అధికారులు పరిస్థితులను సమీక్షించారు.
high alert in Delhi for next 24 hours
- Advertisement -