- Advertisement -
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది వైజయంతి మూవీస్ బ్యానర్. ప్రభాస్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. వైజయంతి మూవీస్ బ్యానర్ 50 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో మహానటి ఫేం నాగ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో ప్యాన్ ఇండియా మూవీని తెరకెక్కించనున్నట్లు బుధవారం ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కాగా, ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ పిరియాడిక్ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.
Nag Ashwin to direct Prabhas in Vyjayanthi Movies
- Advertisement -