- Advertisement -
హుద్హుద్ తుఫాను బాధితుల కోసం నిర్మించిన ఇళ్లను ప్రారంభించాలని కోరుతూ బుధవారం ప్రముఖ నిర్మాతలు డి.సురేష్బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్ తదితరులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ “హుద్ హుద్ తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో 320 ఇళ్లను నిర్మించాము. టెలీథాన్ పేరుతో నిర్వహించిన ప్రత్యేక షో ద్వారా వచ్చిన రూ.15 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాము. ఇళ్ల నిర్మాణం పూర్తయినందున వాటిని ప్రారంభించి తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన వారికి అందించాలని సిఎం జగన్కు విజ్ఞప్తి చేశాము” అని అన్నారు.
Tollywood Producers meet with CM Jagan
- Advertisement -