Wednesday, May 1, 2024

పొలంలోనే పొట్టన పెట్టుకున్నరు

- Advertisement -
- Advertisement -

Brutal murders of former MPTC couple

 

మాజీ ఎంపిటిసి దంపతుల గొంతుకోసి దారుణ హత్యలు
భూ వివాదమే ఘాతుకానికి కారణం?

మనతెలంగాణ/వీణవంక: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, కొండపాక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి దంపతులను గుర్తుతెలియని అగంతకులు గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. కొండపాక గ్రామానికి చెందిన పూరెల్ల సుశీల, పోశాలు మంగళవారం తమ పొలం వద్దకు వెళ్లారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వారి గొంతులు కోసి పరారయ్యారు. దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ దంపతులిద్దరికీ ఇంటి సమీపంలోనే మూడెకరాల భూమి ఉంది. ఈ విషయంలో కొందరితో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదంపై కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. పొలంలో గెట్ల పంచాయితీ కారణంగా పోశాలు తన ప్రత్యర్థులతో పలు మార్లు తగవు పెట్టుకున్నట్టు స్థానికులు పోలీసులకు వివరించారు. అయితే దంపతుల హత్యకు పాల్పడిన వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. భూ తగదాలే భార్య, భర్తలా మరణాలకు కారణమా? ఒకవేళ అయితే ఇందులో ఎంతమంది పాల్గొన్నారో తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News