Monday, May 13, 2024

ప్లాట్ లో ఆరుగురు ఉరేసుకొని….

- Advertisement -
- Advertisement -

 

గాంధీనగర్: ఆరుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమ్రిష్ పటేల్ (42), గౌరంగ్ పటేల్ (40) ఇద్దరు సోదరులు తమ భార్యలకు బయటకు వెళ్తున్నామని చెప్పి వెళ్లారు. తమతో పాటు నలుగురు పిల్లలను బయటకు తీసుకెళ్లారు. బయటకు వెళ్లిన వారు రాకపోవడంతో భార్యలు అహ్మదాబాద్ పట్టణంలో ఉన్న ప్లాట్‌కు వెళ్లి డోర్ తట్టారు. డోర్ తీయకపోవడంతో స్థానిక పోలీసుల సహాయంతో డోర్‌ను ఓపెన్ చేశారు. ఆరుగురు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. అమ్రిష్, గౌరంగ్ మత్తుమందు కలిపిన ఆహారాన్ని పిల్లలకు ఇచ్చిన అనంతరం ఉరి తీశారని, అనంతరం వాళ్లిద్దరూ ఉరేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల లేక కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నారా? తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News