- Advertisement -
న్యూఢిల్లీః భారత్లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,148 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 434 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం 6,04,641 కరోనా పాజిటీవ్ నమోదయ్యాయి. ఇప్పటివరకు 17,834 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,26,947 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనా బారిన పడి ఇప్పటివరకు 3,59,859 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, దేశంలో ఇప్పటివరకు 90,56,173 కరోనా పరీక్షలు చేశామని అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 2,29,588 మందికి కరోనా టెస్టులు చేసినట్లు చెప్పారు.
19148 New Corona Cases reported in India
- Advertisement -