Thursday, May 16, 2024

దెయ్యం పట్టిందని… పంది మలమూత్రాలు తినిపించి….

- Advertisement -
- Advertisement -

Woman eat pig excreta drive out evil at odisha

భువనేశ్వర్: మహిళకు దయ్యం పట్టిందని మంత్రగాడు దెబ్బలు కొట్టి నిప్పుతో కాల్చి… పంది మలమూత్రాలు తినిపించిన సంఘటన ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ మహిళకు కొన్ని రోజుల అస్వస్థతకు గురికావడంతో ఆదివారం ఆమెను స్థానిక మంత్రగాడు వద్దకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఆమెకు దెయ్యం పట్టిందని మంత్రాలు జపాలు చేయాలని భూతవైద్యుడు సూచించాడు. ఆమెకు నుదుట బొట్టు పెట్టిన అనంతరం వీపులో నాలుగు దెబ్బలు కొట్టాడు. అంతే కాకుండా ఎర్రగా కాల్చిన సీకుతో ముఖంపై వాతలు పెట్టాడు. చివరగా దెయ్య పూర్తిగా పోవాలంటే పంది మలమూత్రాలు తినిపించాలని చెప్పాడు. బలవంతంగా పంది మలమూత్రాలు ఆమెకు తినిపించాడు. ఆమె ఇంటికి వెళ్లిన తరువాత ఆరోగ్యం విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను విచారించారు. భూత వైద్యుడు తనకు దెయ్యం పట్టిందని హింసించాడు చెప్పడంతో ఆ మంత్రగాడిని అరెస్టు చేశామని మల్కాన్‌గిరి ఎస్‌పి రిషికేశ్ ఖిల్లారి తెలిపాడు. గిరిజనులలో అవగాహన లేకపోవడంతో ఇలాంటివి జరుగుతున్నాయని ఎస్‌పి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News