Saturday, April 27, 2024

సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేం: ఎన్జీటీ

- Advertisement -
- Advertisement -

Can not interfere in TS Secretariat demolition: NGT

హైదరాబాద్‌ః తెలంగాణ సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేమని నేషనల్ గ్రీన్ బ్య్రునల్(ఎన్జిటీ) స్పష్టం చేసింది. మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపి ఎ రేవంత్ రెడ్డి సచివాలయం పాత భవనం కూల్చివేతలను ఆపాలని కోరుతూ వేసిన పిటిషన్ ను ఎన్జిటీ తిరస్కరించింది. కూల్చివేతకు హైకోర్టు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎన్జిటీ పేర్కొంది. అయితే, సచివాలయం కూల్చివేత నేపథ్యంలో పర్యావరణ కాలుష్యంపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సెంట్రల్ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు(పిసిబి), హైదరాబాద్ పిసిబి, ఐఐటి హైదరాబాద్ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మరో రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జిటీ కమిటీని ఆదేశించింది. తదుపరి విచారణను ఎన్జిటీ సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది.

Can not interfere in TS Secretariat demolition: NGT

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News