Sunday, May 5, 2024

తెలంగాణలో కొత్తగా 2,207 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

2207 new Covid 19 cases reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2,207 కొత్త కోవిడ్-19 కేసులు, 12 మరణాలు సంభవించినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 75,275కి చేరాయి. ఇప్పటివరకు 601మంది బాధితులు ఈ వైరస్ తో చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 21,412 యాక్టివ్ కేసులుండగా… 53,239 మంది కరోనాతో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా హైదరాబాద్ లో 532, రంగారెడ్డిలో 196, మేడ్చల్ లో 136 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 21,417 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ టెస్టుల సంఖ్య 5,66,984కి చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News