Tuesday, March 19, 2024

ట్రక్కు బోల్తా: మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం (వీడియో)

- Advertisement -
- Advertisement -

Locals rush to loot liquor bottles after a truck

రాయ్‌పూర్: మద్యం బాటిళ్ల లోడుతో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధాలో జరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు మద్యం బాటిళ్ల కోసం పరుగులు పెట్టారు. చోరీ చేసి తీసుకెళ్లడంలో ఒకరికొకరు పోటీ పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కొందరిని అడ్డుకున్నారు. అయిన స్థానికులు మద్యం బాటిళ్లను కొట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఎక్సైజ్‌ అధికారి మీడియాతో మాట్లాడుతూ… ఆ ట్రక్కులో 200 కార్టన్ల మద్యం బాటిళ్లు తీసుకెళ్తుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. వాటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ట్రక్కు బోల్తా పడడం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News